Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఎమ్మెల్యే షకీల్దేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మీర్జా ఇన్ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. మీర్జా ఇన్ఫ్రాలో బిజినెస్ పార్ట్నర్గా ఉన్న ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు తనది కాదని గురువారం షకీల్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టిక్కర్ వేరే ఫ్రెండ్కు ఇచ్చానన్నారు. అయితే ఇప్పుడు కారు షకీల్దేనని దాదాపుగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మీర్జా, అతడి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Read More : MLA Shakeel Car : జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి
అసలేం జరిగింది ?
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారిని బలైంది. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్ నంబర్ 45 ఢివైడర్ను ఎక్కి చెట్టును ఢీ కొట్టింది. రోడ్ దాటుతున్న బెలూన్స్ అమ్ముకునే అభాగ్యుల పైకి దూసుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులను మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. కారు బీభత్సం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. బాధితులు 20 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారంటే కారు ఎంత వేగంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు పైసాపైసా కూడబెట్డుకున్న డబ్బుతో పాటు వారి సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి.
Read More : తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం..!
కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అనుచరుడు మీర్జా నడిపినట్లు తెలుస్తోంది. కానీ రిజిస్ట్రేన్ మాత్రం ఇన్ఫ్రా కంపెనీ పేరుతో ఉంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. కారుకు ఎమ్మెల్యే స్టికర్ ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేకి రెండు స్టికర్లు మాత్రమే ఇస్తారు. కానీ ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చింది? ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన ఫ్రెండ్స్కు కారు స్టిక్కర్ ఇచ్చినట్టు తొలుత చెప్పారు. ప్రమాదం చేసిన కారు ఆ ఫ్రెండ్స్దేనా.. ప్రమాదం తర్వాత పరారైన మీర్జా ఎమ్మెల్యే స్నేహితుడేనా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరారీలో ఉన్న మీర్జా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను పట్టుబడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి కారు నడిపారా.. లేక ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.