మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.

Peerzadiguda Municipal Corporation : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మేయర్ వెంకట్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జక్కా వెంకట్ రెడ్డి మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కొత్త మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ కు 5 మంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.

Also Read : కొత్త అధ్యక్షుడిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ అధిష్టానం..! కారణం ఏంటి..

ట్రెండింగ్ వార్తలు