AP Volunteers: వాలంటీర్లకు వందనం.. వరుసగా మూడో ఏడాది అవార్డులు ప్రధానం.. ప్రారంభించనున్న సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు ఉత్తమ వాలంటీర్లకు ప్రభుత్వం అవార్డులు ప్రధానం చేయనుంది.

AP CM Jagan: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాలంటీర్లలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి ప్రతీ ఏడాది ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రమం ద్వారా పురస్కారాలు అందిస్తున్న విషయం విధితమే. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం.. వరుసగా మూడో ఏడాది ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డుల ప్రధానం చేయనుంది. విజయవాడ‌లో లాంఛనంగా సీఎం వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు.

CM Jagan : వెన్నుపోటు వీరుడు… ప్యాకేజీ స్టార్

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రూ. 243.34 కోట్లతో కలిపి ఇప్పటివరకు వాలంటీర్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారాల మొత్తం రూ. 705.68 కోట్లుకు చేరనుంది. గ్రామ/వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ/ వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ఈ సత్కారం చేయనుంది. శుక్రవారం (మే19) నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలవుతుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందించనున్నారు.

CM Jagan: ఎన్నికల వేళ…సీఎం జగన్‌ మరో ప్రోగ్రాం

సేవా వజ్ర కేటగిరిలో ఎంపికైన వాలంటీర్లకు.. సేవావజ్ర సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతిగా ప్రభుత్వం అందించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం చేయనున్నారు.

సేవా రత్న కేటగిరిలో ఎంపికైన వాలంటీర్లకు.. సేవా రత్న సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతిగా అందించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10మంది చొప్పున టాప్‌ 1 శాతం ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4,220 మందికి ఈ సేవారత్న పురస్కారాలను ప్రధానం చేస్తారు.

సేవా మిత్ర కేటగిరిలో ఎంపికైన వాలంటీర్లకు.. సేవామిత్ర సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాలను ప్రధానం చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు