Blast In Eluru : ఏలూరు జిల్లా తాడేపల్లి చొప్పరమెట్ల డంపింగ్ యార్డులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హ్యాపీ వ్యాలీ స్కూల్ కి చెందిన వేస్టేజ్ ను తరలించేందుకు కిషోర్ అనే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. అతడు కూలీల సాయంతో వేస్టేజ్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని దర్యాఫ్తు చేపట్టారు.
పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తిని దుర్గాప్రసాద్ గా గుర్తించారు. గాయపడ్డ వారిని ప్రసాద్, మహేష్ గా గుర్తించారు. వీరంతా కార్మికులే. ఈ పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. పేలుడు శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అసలు పేలుడు ఎలా జరిగింది? పేలుడికి కారణం ఏంటి? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
Also Read..Hyderabad Blast : హైదరాబాద్లో పేలుడు కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఈ వేస్టేజ్ అంతా హ్యాపీ వ్యాలీ స్కూల్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వేస్టేజ్ లో కొన్ని డబ్బాలను పోలీసులు గుర్తించారు. ఆ డబ్బాలే పేలుడికి కారణం అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అసలు ఆ డబ్బాల్లో ఏముంది? అనేది తెలియాల్సి ఉంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వేస్టేజ్ ను తరలిస్తున్న కాంట్రాక్టర్ కిషోర్ ను సైతం పోలీసులు విచారించారు. పేలుడు ఘటనకు సంబంధించి తనకేమీ తెలియదని కిషోర్ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. మొత్తంగా భారీ పేలుడు తీవ్ర కలకలమే రేపింది.