Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను గజపతినగరం పీహెచ్సీకి తరలించారు.
చదవండి : Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు
తీవ్రంగా గాయపడిన వారిని విశాఖకు తరలించారు. క్షతగాత్రులు మెంటాడ మండలం చింతాడవలస వాసులుగా గుర్తించారు. రాచకిండాంలో వివాహానికి హాజరై ట్రాక్టర్లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో 35 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి : Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి