Vandebharat Train : ఏప్రిల్ 8న తిరుపతికి వందేభారత్ రైలు.. తెలుగు రాష్టాలకు రెండోది

తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ - తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది.

Vandebharat Train : తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ – తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెడతారని తెలుస్తోంది. నారాయణాద్రి రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు వెళ్తుంది. తిరుపతి వందేభారత్ రైలును మొదటగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రూట్ లోనే నడపనున్నట్లు తెలుస్తోంది.

Vande Bharat Express : నల్లగొండ మీదుగా తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్!

సావల్యపురం ఒంగోలు రూటు పూర్తి అయ్యాక ఈ మార్గం నుంచి వందే భారత్ రైలు నడుపుతారని సమాచారం. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో రైలు ఆగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు హైదారాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతుంది. అదే వందేభారత్ రైలులో 6:30గంటల్లోనే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు