Indo-Pak couples love stories : భారత్-పాక్ జంటల ప్రేమ కథల్లో ట్విస్ట్…సీమా హైదర్, అంజూల ప్రేమ బాగోతాలు

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తాజాగా సాగిన రెండు జంటల్లో చిగురించిన ప్రేమ కథల్లో వారి వివాహాలతో ఒక్కటయ్యారు. పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చి తన ప్రేమికుడైన సచిన్ మీనాను పెళ్లాడింది. మరో వైపు ఇదే సమయంలో భారతదేశానికి చెందిన అంజూ పాకిస్థాన్ వెళ్లి తన ఫేస్ బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న ఘటనలు రెండు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది....

Seema Haider and Anjulas love stories

Indo-Pak couples love stories : భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తాజాగా సాగిన రెండు జంటల్లో చిగురించిన ప్రేమ కథల్లో వారి వివాహాలతో ఒక్కటయ్యారు. పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చి తన ప్రేమికుడైన సచిన్ మీనాను పెళ్లాడింది. మరో వైపు ఇదే సమయంలో భారతదేశానికి చెందిన అంజూ పాకిస్థాన్ వెళ్లి తన ఫేస్ బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న ఘటనలు రెండు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. (twist in the love stories of Indo-Pak couples)

పబ్ జి ఆటతో చిగురించిన ప్రేమ

పాకిస్థాన్ దేశానికి చెందిన వివాహిత సీమా హైదర్ కు భారతదేశానికి చెందిన యువకుడు సచిన్ మీనాలు పబ్ జి ఆట ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి స్వదేశం వదిలి సీమా హైదర్ వచ్చి తన ప్రియుడైన సచిన్ మీనాను పెళ్లాడింది. సీమా హైదర్ ది నిజమైన ప్రేమ లేదా పాకిస్థాన్ ఏజెంటుగా భారత్ కు వచ్చిందా అనే కోణంలో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ విభాగం, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏటీఎస్ రహస్య దర్యాప్తు

సీమా, సచిన్ లో పెళ్లి అనంతరం కాపురం ఉంటున్నారు. (Seema Haider and Anjulas love) సీమా హైదర్ ప్రేమబాగోతంలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. భారతదేశానికి చెందిన అంజూ తన భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి తన ఫేస్ బుక్ ప్రియుడిని పెళ్లాడిన ఘటన సంచలనం రేపింది. పాక్, భారత్ దేశాల ప్రేయసీ, ప్రియుల మధ్య జరిగిన రెండు ఘటనలపై భారత్, పాక్ దేశాల ఇంటెలిజెన్స్ విభాగాలు రహస్య దర్యాప్తు సాగిస్తున్నాయి. మొత్తంమీద ఈ రెండు ప్రేమ కథల బాగోతాలు ఒకే సమయంలో వెలుగుచూడటం విశేషం.

అంజూ, నస్రుల్లాల ప్రేమ బాగోతం

సీమా హైదర్ భర్తను వదిలి పిల్లలతో భారతదేశంలోని ప్రియుడి వద్దకు వచ్చింది. మరో వైపు భారత మహిళ అంజూ తన భర్త, ఇద్దరు పిల్లల్ని భారత్ లో వదిలి పాకిస్థాన్ వెళ్లి ప్రియుడిని పెళ్లాడిన ఘటనలు సోషల్ మీడియాలో, పత్రికల్లో తీవ్ర ఆసక్తిని రేకేత్తించాయి. అంజూ మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకొని నస్రుల్లాను పెళ్లాడింది.  ఈ రెండు ప్రేమ ఘటనల్లో భారత, పాక్ ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.

ఏకకాలంలో వెలుగుచూసిన ప్రేమకథలు

ఈ రెండు ప్రేమకథల్లోనూ మహిళలే ప్రియుడి వద్దకు రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముందు పాక్ మహిళ భారత్ వచ్చాక, భారత మహిళ పాక్ వెళ్లింది. ఈ రెండు ఘటనల్లో ప్రేమబంధంపై ప్రస్థుతం రెండు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు.

ట్రెండింగ్ వార్తలు