జగన్‌కు దమ్ముంటే.. వాళ్ల బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలి- మహిళా మంత్రి సవాల్

కక్షపూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారు.

Minister Gummidi Sandhyarani : ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి.. మాజీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే.. వాళ్ల బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని చాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యం కోరే వారే అయితే వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలన్నారు. జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. గొడవలు, కొట్లాట్లకు వైసీపీ నేతలే ఆద్యులని విరుచుకుపడ్డారామె.

”నేడు ప్రాజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది. అబద్దాలు ఆడటం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. చిన్న పిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం కోరే నాయకులు అయితే వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలి. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేసిన వ్యక్తి కూడా ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటు.

కక్షపూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారు. కానీ, మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించారు. అందుకే చట్ట ప్రకారం వెళ్తున్నాం. వైసీపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.

టీడీపీ నేతలు సహనంతో ఉండాలి. సమస్యలు ఉంటే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటాం. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం” అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

Also Read : ఒక్క ఓటమితో అంతా తారుమారు.. రోజా పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనా? ఎందుకీ దుస్థితి?

ట్రెండింగ్ వార్తలు