Crime News: పార్కులో ఉన్న అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన యువకుడు

ఆ అమ్మాయి ఓ యువకుడితో కలిసి పార్కులోకి వచ్చిందని పోలీసులకు స్థానికులు చెప్పారు.

Crime News - Delhi

Crime News – Delhi: పార్కులో కూర్చున్న ఓ అమ్మాయిని ఓ యువకుడు అతి దారుణంగా చంపేశాడు. ఢిల్లీలో ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Delhi police) వివరాలు తెలిపారు.

ఢిల్లీలోని మాలవీయ నగరంలో ఈ హత్య జరిగిందని చెప్పారు. అరబిందో కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి (25) స్థానికంగా ఉన్న ఓ పార్కులో కూర్చుంది. ఆ పార్కు అరబిందో కాలేజీకి సమీపంలో ఉంటుంది. ఆ అమ్మాయి పార్కులో కూర్చున్న సమయంలో ఓ రాడ్డుతో అక్కడకు వచ్చాడు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి (25).

ఆ అమ్మాయి తలపై రాడ్డుతో బాది అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు తమకు సమాచారం అందించారని సౌత్ ఢిల్లీ డీసీపీ చందన్ చౌదరి అన్నారు. ఆ అమ్మాయి ఓ యువకుడితో కలిసి పార్కులోకి వచ్చిందని స్థానికులు తమకు చెప్పారని ఆయన అన్నారు.

ఆ అమ్మాయి తలపై బలమైన గాయాలు కనపడ్డాయని వివరించారు. ఆమె మృతదేహం వద్ద ఓ ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ అమ్మాయిని చంపిన యువకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు