Vikarabad : స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి, గొంతుకోసి నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్, డీజీపీకి కీలక ఆదేశం

Vikarabad : అసలు శిరీష అంతా రాత్రి బయటకు ఎందుకొచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చంపేశారు?

Vikarabad Nursing Student

Vikarabad – National Commission For Women : వికారాబాద్ లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్క్రూ డ్రైవర్ తో కళ్లు పొడిచి, బ్లేడ్ తో గొంతుకోసి విద్యార్థినిని అత్యంత కిరాతకంగా, భయానకంగా చంపేశారు. ఈ హత్య జరిగిన తీరు ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. ఈ పరిణామం జాతీయ మహిళా కమిషన్ ను కలిచివేసింది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్ గ్రామంలో 19ఏళ్ల బాలిక దారుణ హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. బాలిక కళ్లలో స్క్రూ డ్రైవర్‌తో పొడిచి, బ్లేడ్‌తో గొంతు కోసి, నీటికుంటలో పడేసిన ఘటనపై మీడియా కథనాల ఆధారంగా ఈ హత్య కేసును సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

బాలిక దారుణ హత్యను తీవ్రంగా ఖండించింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది జాతీయ మహిళా కమిషన్. బాలిక హత్య ఘటనపై కాలపరిమితితో కూడిన దర్యాప్తును కోరింది ఎన్సీడబ్ల్యూ. చట్ట ప్రకారం తప్పనిసరిగా F.I.R దాఖలు చేయాలంది. అలాగే, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై 3 రోజుల్లోగా నివేదికను అందజేయాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్.

Also Read..Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేశాను: బాధితురాలు

 

అసలేం జరిగిందంటే..
నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్‌ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్‌ ట్రైనింగ్ తీసుకుంటోంది. జూన్​ 10న అర్ధరాత్రి వరకు ఇంట్లోనే ఉన్న శిరీష.. తెల్లారే సరికి ఇంట్లో కనిపించలేదు. కంగారుపడిన కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. కానీ, శిరీష ఆచూకీ లేదు.

Also Read..Vizianagaram : హీరోయిన్‌ను చేసేందుకు కూతురికి హార్మోన్ ఇంజెక్షన్ల కేసులో ట్విస్ట్.. తల్లి సంచలన ఆరోపణలు

తీరా.. మధ్యాహ్నం గ్రామ శివారులో ఉన్న నీటికుంట దగ్గర శిరీష దుస్తులు కనిపించాయి. చెరువులో చూడగా.. శిరీష మృతదేహం తేలుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు శిరీష మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయపడిపోయారు. అంత దారుణం ఉంది. శిరీష రెండు కళ్లను స్క్రూ డ్రైవర్ లాంటి పదునైన వస్తువుతో పొడిచారు. మరో పదునైన వస్తువుతో గొంతు కోశారు. శిరీష ఒంటిపై గాయాలూ ఉన్నాయి.

అసలు శిరీష రాత్రి బయటకు ఎందుకొచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చంపేశారు? ఎందుకు చంపారు? మరీ ఇంత క్రూరంగా, భయానకంగా చంపడానికి కారణాలేంటీ? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు