Kamreddy : పెళ్లయిన నెలకే…భార్య గొంతు కోసి చంపేసిన కిరాతక భర్త

ఆగస్టు 27న పెళ్లి.. సెప్టెంబర్‌ 26న హత్య. నిండునూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానంటూ పెళ్లిపందిట్లో బాసలు చేసిన భర్త.. నెలరోజుల్లోనే కిరాతకుడిగా మారాడు.

Woman Brutally Murdered : ఆగస్టు 27న పెళ్లి.. సెప్టెంబర్‌ 26న హత్య. నిండునూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానంటూ పెళ్లిపందిట్లో బాసలు చేసిన భర్త.. నెలరోజుల్లోనే కిరాతకుడిగా మారాడు. పెళ్లింట్లో కట్టిన తోరణాలు తీయకముందే.. కిరాతకంగా నవ వధువు ప్రాణాలు తీశాడు. పెళ్లయిన వారం రోజులకే భార్యపై అనుమానం పెంచుకుని.. కక్షగట్టిన కసాయి మొగుడు.. నెల రోజులు తిరక్కుండానే భార్యను పైలోకాలకు పంపాడు.పెద్దలు ఏరికోరి మరీ.. కామారెడ్డికి చెందిన కిరణ్‌, సుధారాణికి పెళ్లిచేశారు. 14 లక్షల కట్నం.. కామారెడ్డిలో ఒక ఫ్లాట్‌.. తులాల కొద్దీ బంగారాన్ని వరకట్నంగా సమర్పించుకున్నారు వధువు తల్లిదండ్రులు.

Read More : Golden Space Rock : అంతరిక్షం నుంచి పొలంలో జారిపడ్డ 2.5 కిలోల రాయి!

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డను కిరణ్‌ చేతిలో పెట్టారు. ఎంతో ఇష్టపడి చేసిన పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతుందని.. తమ బిడ్డను చేసుకున్నవాడే ఆమె పాలిట యముడవుతాడని.. తమకు పుట్టెడు దుఖాన్ని మిగులుస్తాడని సుధారాణి తల్లిదండ్రులు అసలు ఊహించలేదు. పెళ్లయిన నెలకే.. ఆ నవ వధువుకు నూరేళ్లు నిండాయి. ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన సుధారాణి.. నెల రోజులకే దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Read More : Cris Galera : తనను పెళ్లి చేసుకుంటే రూ.4 కోట్లు ఇస్తాన్న అరబ్ షేక్.. సున్నితంగా తిరస్కరించిన మోడల్

కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌, సుధారాణికి గత నెలలోనే పెళ్లయింది. పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వారి కాపురాన్ని.. అనుమానం రూపంలో మృత్యువు కాటేసింది. పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్‌.. భార్యను గొంతు, కాళ్లు, చేతులు కోసి అతి కిరాతకంగా.. దారుణాతి దారుణంగా హత్యచేశాడు. భార్యను అతికిరాతకంగా చంపేసిన కిరణ్‌.. ఆ తర్వాత ఆత్మహత్యా నాటకం ఆడాడు. తన చేతులపైనా బ్లేడ్‌తో గాయపర్చుకున్నాడు. దీంతో.. గాయాలపాలైన కిరణ్‌ను.. గాంధీ ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా.. భార్యను గొంతునులిమి చంపేసేందుకు కిరణ్‌ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో రాజీ కుదర్చడంతో.. అప్పుడు వివాదం సద్దుమణిగినా.. అది సుధారాణి ప్రాణాలమీదకే తెచ్చింది. సుధారాణి మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.. కామారెడ్డిలోని కిరణ్‌ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కిరణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు