Gwalior: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పొరుగువారితో ఫోన్లో మాట్లాడకూడదని అడ్డుకున్న భర్త జననాంగాలపై మరుగుతున్న నూనె పోసింది ఒక మహిళ. ఈ ఘటన గ్వాలియర్ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి పేరు సునీల్ ధాకడ్. నిందితురాలి పేరు భావన. భావన తరుచూ పొరుగింటివారితో ఫోన్లో మాట్లాడుతుండడంపై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమెను చాలాసార్లు వారించాడు. మాట్లాడకూడదంటూ నిషేధించాడు.
Assam flood: అసోం వరదల్లో 25 గ్రామాల ముంపు..29 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
అయినప్పటికీ భావన వారితో మాట్లాడుతూనే ఉంది. దీంతో భావన ఫోన్ లాక్కున్నాడు సునీల్. అప్పటి నుంచి భర్తపై కోపంగా ఉన్న భావన.. అతడు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అతడి జననాంగాలపై మరుగుతున్న నూనే పోసింది.దీంతో సునీల్ జననాంగాలు బాగా దెబ్బతిందని పోలీసులు తెలిపారు. సునీల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భావనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత నిందితురాలు భావన పరారీలో ఉంది.
తన భార్య భావన మొబైల్ లాక్కోవడంతో కోపానికి లోనై.. తాను నిద్రిస్తున్న సమయంలో మరుగుతున్న నూనెను తన జననాంగాలపై పోసి పారిపోయిందని భర్త సునీల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. నొప్పితో బాధపడుతున్న తను సహాయం కోసం కేకలు వేయడంతో ఇరుగుపొరుగు ఇంటికి చేరుకుని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. భర్త వాంగ్మూలాల మేరకు పోలీసులు భావనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.