Earthquakes : అఫ్ఘానిస్థాన్ దేశంలో ఏడుసార్లు వచ్చిన భారీ భూకంపంతో 320 మంది మరణించగా, మరో వెయ్యిమందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి అధికారులు చెప్పారు. మొదట అప్ఘానిస్థాన్లోని పశ్చిమ ప్రాంతంలో శనివారం అరగంట వ్యవధిలో మూడు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కాగా పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 120కి చేరుకుందని విపత్తు సహాయక అధికారులు తెలిపారు. మరో 1,000 మందికి పైగా గాయాలతో చికిత్స పొందుతున్నారు.
Read Also : ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా.. నేలమాళిగలో సురక్షితం
హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కార్యకలాపాల కేంద్రం గుర్తించారు. అంతకుముందు సెప్టెంబర్ 4వ తేదీన అప్ఘానిస్థాన్లోని ఫైజాబాద్లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆగస్టు 28వతేదీన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో మరో భూకంపం తాకింది. కేవలం మూడు గంటలలోపు భూకంపాలు రావడంతో నివాసితులు,దుకాణదారులు నగరంలో భవనాలను వదిలి పారిపోయారు. భూకంప కేంద్రం అఫ్ఘాన్ లోని అతిపెద్ద నగరమైన హెరాత్కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Also : Israel : హమాస్ దాడి ఎఫెక్ట్..ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాల రద్దు
ఆ తర్వాత రిక్టర్ స్కేలుపై 4.3, 6.3 మధ్య తీవ్రతతో ఎనిమిది భూకంపాలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భారీ భూకంపం వల్ల గాయపడిన వెయ్యిమందిని ఆసుపత్రుల్లో చేర్చామని హెరాత్ ప్రావిన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ మోసా అషారీ చెప్పారు. శనివారం ఉదయం 11:00 గంటలకు భూకంపాలు ప్రారంభమైనందున నివాసితులు హెరాత్లోని భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా కుప్పకూలాయని, ఇళ్లన్నీ దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఈశాన్య అఫ్ఘానిస్థాన్లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 13 మంది మరణించారు.