Viral Video: కస్టమర్లను ఐకియా స్టోర్లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాలోని ఐకియా స్టోర్కు వెళ్ళివచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తేలింది. దీంతో వెంటనే ఆ స్టోర్ లోని వారందరినీ ఐసోలేషన్ లో ఉంచాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఐకియా స్టోర్ ద్వారాలు అన్నింటినీ మూసివేయడానికి ప్రయత్నించారు.
ఈ విషయాన్ని గుర్తించిన కస్టమర్లు వెంటనే ద్వారాల వద్దకు పరుగులు తీశారు. అధికారులు ద్వారాలు వేయడానికి ప్రయత్నిస్తుండగా, వాటిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు కస్టమర్లు. ఈ ఘటనపై ఐకియా స్టోర్ ప్రతినిధులు ఇప్పటివరకు స్పందించలేదు. షాంఘైలో జనాభా అధికంగా ఉంటుంది. కరోనాను ఎదుర్కొనేందుకు చైనా జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది.
ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాలను పాటిస్తుంటే చైనా అందుకు భిన్నంగా ఒక్క కేసు కూడా తమ దేశంలో ఉండకూడదని ఈ విధానాన్ని అవలంబిస్తోంది. తమ దేశం అనుసరిస్తోన్న జీరో-కొవిడ్ పాలసీ వల్లే ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని చైనా ప్రభుత్వం అంటోంది. జీరో-కొవిడ్ విధానంలో భాగంగా చైనా కఠిన ఆంక్షలు విధిస్తుండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
Yesterday, an abnormal health code case was presented at an IKEA in Shanghai, & the entire mall was suddenly blocked?
Some ppl forced their way out for fear of being sent to concentration camps, but there is actually nowhere to escape under #AmazingChina’s digital surveillance pic.twitter.com/MWpbTOJ3kz
— Donna Wong?? (@DonnaWongHK) August 14, 2022