Acharya: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నుండి అప్డేట్ రాబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ట్రైలర్కు సంబంధించి చిత్ర యూనిట్ త్వరలోనే ఓ అనౌన్స్మెంట్ చేయబోతుందని చిత్ర వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ ఆచార్య చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది.
Acharya: ట్రైలర్కు టైమ్ ఫిక్స్ చేసిన ఆచార్య..?
ఆచార్య చిత్రం నుండి ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడనేది ఇవాళ సాయంత్రం 4.59 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. చిరంజీవి సరికొత్త లుక్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తుండటంతో, చిరు-చరణ్ కాంబోలో రాబోయే సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయా అని అభిమానులు అప్పుడే చర్చించుకుంటున్నారు.
Chiranjeevi: చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్!
కొరటాల శివ మార్క్ టేకింగ్, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు హైలైట్గా నిలవనుండగా, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 29న ఆచార్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
The Time has come for the MIGHTY MASS update?#AcharyaTrailer Announcement today at 4:59 PM ??#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/IUbskTnrgQ
— Konidela Pro Company (@KonidelaPro) April 9, 2022