Acharya: ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్ చేసిన ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ....

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో టాలీవుడ్‌లో వరుసగా బడా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ ఆచార్య చిత్రాన్ని మాత్రం ఇంకా రిలీజ్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వారు ఆతృతగా చూస్తున్నారు.

Acharya: ఆచార్య పాఠాలు అక్కడ లేనట్టేనా?

అయితే వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఉగాది రోజున ఆచార్య నుండి ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏప్రిల్ 10న ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఆచార్య చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయడమో.. లేక ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన డేట్ అండ్ టైమ్‌ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

Acharya: ఎట్టకేలకు ఆచార్య వస్తున్నాడోచ్!

ఏప్రిల్ 29న ఆచార్య చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిరు అండ్ టీమ్ ప్లాన్ చేస్తుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 10న ఆచార్య ట్రైలర్‌కు సంబంధించి ఒక అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ఆచార్య ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా అందాల భామలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు