Bandi Sanjay: అందుకే ప్రశ్నపత్రాల లీకేజీలు.. ఇప్పుడు టెన్త్ విద్యార్థుల్లో ఒత్తిడి, గందరగోళం: బండి సంజయ్

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Bandi Sanjay: తెలంగాణలో పదో తరగతి తెలుగు పేపర్ లిక్ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని విమర్శించారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.

ఈ లికేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని బండి సంజయ్ చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని చెప్పారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని విమర్శించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని అన్నారు.

పేపర్ లికేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తోందని చెప్పారు. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందని అన్నారు.

మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. విద్యార్థులంతా టెన్షన్ కు గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని అన్నారు. 10వ తరగతి తెలుగు పేపర్ లికేజీపై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని, బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Vanama Venkateshwara Rao: కొత్తగూడెం నుంచి మళ్లీ పోటీ చేసేది నేనే.. అసలు ఎవరు నువ్వు?: ఎమ్మెల్యే వనమా

ట్రెండింగ్ వార్తలు