Tollywood Malty-starers: క్రేజీ మల్టీస్టారర్స్.. ఒకే టికెట్‌పై డబుల్ బోనాంజా!

ఆర్ఆర్ఆర్ తో రామ్ - చరణ్.. ఇచ్చిన హీట్ టాలీవుడ్ ని బాగానే వేడెక్కిస్తోంది. అవును ఒకే టికెట్ పై డబుల్ బోనాంజా ఎంజాయ్ చేయాలంటే క్రేజీ మల్టీస్టారర్ రావాల్సిందే. స్టార్ హీరోలు చేతులు..

Tollywood Malty-starers: ఆర్ఆర్ఆర్ తో రామ్ – చరణ్.. ఇచ్చిన హీట్ టాలీవుడ్ ని బాగానే వేడెక్కిస్తోంది. అవును ఒకే టికెట్ పై డబుల్ బోనాంజా ఎంజాయ్ చేయాలంటే క్రేజీ మల్టీస్టారర్ రావాల్సిందే. స్టార్ హీరోలు చేతులు కలపాల్సిందే. మొన్నటివరకు ఎవరి స్టార్ డం వాళ్లదే అన్నట్టు దూరం దూరం ఉన్న హీరోలు.. ఇప్పుడు కంటెంట్ ఉన్న కథ దొరక్కానే సై అనేస్తున్నారు. అలాంటి క్రేజీ మల్టీస్టారర్స్ తో పాటూ ఈ ఇయర్ రాబోతున్న సింగిల్ స్టార్ మూవీస్ పై హావ్ ఎ లుక్.

2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ కి తోడూ సంక్రాంతి సీజన్ కోసం అక్కినేని హీరోలు సైలెంట్ గా స్కెచ్ వేశారు. అయితే ఆ రెండు నేషనల్ వైడ్ టార్గెట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాల వరకే బంగార్రాజు పరిమితం. మనం తర్వాత అక్కినేని తండ్రీకొడుకులు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తోన్న సినిమా ఇది. ఫన్నీ రోల్స్ తో సంక్రాంతి సోగ్గాళ్లు అదరగొడతారనే ప్రచారం బాగానే జరుగుతోంది.

Mohan Babu: నా మౌనం చేతగానితనం కాదు.. సినిమా టికెట్ల వివాదంపై తొలిసారి మోహన్ బాబు!

చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆచార్య ఫిబ్రవరి 4 న రిలీజ్ అవబోతుంది. తండ్రీకొడుకుల క్రేజీ కాంబినేషన్ ఆఢియన్స్ లో విపరీతంగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటి వరకూ ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ ప్లే చేసిన ఈ ఇద్దరూ..ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్స్ చెయ్యడంతో.. సినిమా మీద ఫుల్ హైప్ క్రియేటయింది. ఆడియెన్స్ మెస్మరైజ్ చేయడానికి కొత్తగా కొత్త సీన్స్ కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

సంక్రాంతి రేస్ నుంచి గౌరవంగా తప్పుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న డేట్ ఫిక్స్ చేసుకుంది. వకీల్ సాబ్ తర్వాత వస్తున్న సినిమా కావడం… పవన్ పోలీస్ క్యారెక్టర్ చేయడం… ఆపోజిట్ రోల్ లో రానా నటించడం.. ఇలా ఇన్ని సమ్ థింగ్ స్పెషల్ పాయింట్స్ తో రెడీఅవుతోన్న భీమ్లా నాయక్ గురించి ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ట్రెండింగ్ వార్తలు