Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ వాయిదా..? ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఏమ‌న్నాడంటే..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్(Prabhas) న‌టిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది.

Nag Ashwin clarity

Prabhas-Kalki 2898 AD : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్(Prabhas) న‌టిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొనే(Deepika Padukone), బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan), లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), దిశా ప‌టాని (Disha Patani)లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా 2024 జ‌న‌వ‌రి 12 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం గ‌తంలో ప్ర‌క‌టించింది.

అయితే.. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌నుందే వార్త‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మే 9న ఈ సినిమా రిలీజ్ కానుంద‌నేది ఆ వార్త‌ల సారాంశం. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ పూర్తి అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌డ‌మే అందుకు కార‌ణం అని అంటున్నారు. ఈ వార్త‌ల నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్పందించారు.

Allu – Mega Family : మొన్న బన్నీ, ఇప్పుడు అల్లు అరవింద్.. ఆ రూమర్స్‌కి మరోసారి గట్టి కౌంటర్..

‘క‌ల్కి 2898 ఏడీ’ సినిమా షూటింగ్ చాలా భాగం కంప్లీట్ అయ్యింద‌ని చెప్పారు. కొంత‌భాగ‌మే మిగిలి ఉంద‌న్నాడు. త్వ‌ర‌లోనే మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా దీనిపైనే ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. షూటింగ్ పూర్తి అయిన త‌రువాత విడుద‌ల తేదీ గురించి ఆలోచించ‌నున్న‌ట్లు తెలిపాడు. ఓ శుభ‌ముహూర్తాన ఇందుకు సంబంధించిన విష‌యాన్ని చెబుతాన‌న్నాడు.

ఈ సినిమాలో ఓ కొత్త ప్ర‌పంచాన్ని చూస్తార‌ని, ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఓ సరికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలిపారు. థియేట‌ర్‌లో ఈ చిత్రాన్ని చూసిన వారంతా స‌రికొత్త అనుభూతిని పొందుతార‌న్నారు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే జ‌న‌వ‌రిలో క‌ల్కి విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మేన‌ని అనిపిస్తోంది.

మే 9నే ఎందుకు అంటే..?

క‌ల్కి 2898 ఏడీ మే 9 విడుద‌ల కానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ రోజునే ఈ చిత్రాన్ని ఎందుకు విడుద‌ల చేస్తారు అనే దానికి ఓ కార‌ణం ఉంది. ఈ సినిమాని అశ్వినీ ద‌త్ నిర్మిస్తున్నారు. ఆయ‌న నిర్మించిన ‘జ‌గ‌దేకవీరుడు అతిలోకసుంద‌రి’, ‘మ‌హాన‌టి’ వంటి సినిమాలు మే 9 విడుద‌లై బ్లాక్‌బాస్ట‌ర్‌లుగా నిలిచాయి. ఈ క్ర‌మంలో ఆ సెంటిమెంట్ ప్ర‌కారం మే 9 క‌ల్కి సినిమా విడుద‌ల కానుంద‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో పాటు వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కూడా విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌నుంద‌నే దానికి మ‌రో కార‌ణం అని చెబుతున్నారు.

Rajinikanth : విజయ్ ‘బీస్ట్’ మూవీ హిట్ అయ్యిందా..? ప్లాప్ అయ్యిందా..? రజినీకాంత్ కామెంట్స్..

ట్రెండింగ్ వార్తలు