Samantha : చికిత్స కోసం సినిమాలకు గ్యాప్ అని చెప్పి.. ధ్యానం చేసుకుంటూ భక్తిలో మునిగిపోయిన సమంత..

సమంత త్వరలోనే అమెరికాకు వెళ్తుందని, అక్కడే ఆరు నెలలు ఉండి చికిత్స తీసుకొని, పూర్తిగా రికవర్ అయ్యాకే వస్తుందని పలువురు తెలిపారు. అయితే సమంత అమెరికాకు వెళ్లకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది.

Samantha doing Meditation in Coimbatore Isha Foundation

Samantha :  సమంత(Samantha) చేస్తున్న ఖుషి(Kushi) సినిమా, సిటాడెల్(Citadel) షూటింగ్స్ పూర్తవ్వడంతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం వరకు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి, తన మయోసైటిస్(Myositis) చికిత్సకు అమెరికాకు వెళ్తున్నందునే సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని సమాచారం.

సమంత త్వరలోనే అమెరికాకు వెళ్తుందని, అక్కడే ఆరు నెలలు ఉండి చికిత్స తీసుకొని, పూర్తిగా రికవర్ అయ్యాకే వస్తుందని పలువురు తెలిపారు. అయితే సమంత అమెరికాకు వెళ్లకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. గత రెండు రోజులుగా అక్కడే ఉంటూ అక్కడి ప్రదేశాలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తున్న పలు ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sitara Ghattamaneni : సితార పాప బర్త్‌డే.. మహేష్ కూతురిగా వచ్చి ఇప్పుడు సింగిల్‌గా యాడ్స్.. చిన్నవయసులోనే సూపర్ ఫాలోయింగ్..

సమంత ధ్యానం చేస్తున్న ఫొటోలని షేర్ చేస్తూ.. ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఎటూ కదలకుండా కూర్చోవడం అసాధ్యమనిపించింది. ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మార్గం అని ఇవాళే అర్థమైంది. ఈ ప్రక్రియ ఇంత సింపుల్ గా, ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని ఊహించలేదు అని పోస్ట్ చేసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. అయితే సమంత అమెరికాకు చికిత్స కోసం అని చెప్పి ఇక్కడే భక్తి మార్గంలో ఉందేంటి అని అభిమానులు, నెటిజన్లు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులు ధ్యాన మార్గంలో ప్రశాంతత వచ్చాక చికిత్సకు వెళ్తుందేమో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు