Raj Tharun : లావణ్య రాజ్ తరుణ్ కేసు.. వారం రోజుల గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్‌కి రెడీ..

రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

Raj Tharun Movie Back to Back Ready to Release in One Week Gap

Raj Tharun : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబార్షన్ చేయించి ఇప్పుడు మోసం చేసాడని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకోబోతుందని, నన్ను భయపెట్టింది అని కేసు పెట్టింది. దీంతో గత వారం రోజులుగా లావణ్య – రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా పేర్లు వార్తల్లో నిలుస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో పోలీసులు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే ఓ పక్కన రాజ్ తరుణ్ ఇలా గొడవల్లో, కేసుల్లో ఉంటే మరో పక్క తన సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

Also Read : Sitara Ghattamaneni : బాలీవుడ్ హీరోయిన్ తో సితార పాప అప్పుడు.. ఇప్పుడు.. ఆరేళ్లలో ఎంత ఎదిగిపోయింది..

రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా జులై 26న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు. ఇక రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కలిసి నటించిన తిరగబడర సామీ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఈ రెండు రిలీజ్ డేట్స్ కూడా రాజ్ తరుణ్ – లావణ్య ఇష్యూ బయటకి వచ్చాకే అనౌన్స్ చేయడం గమనార్హం. అయితే ఈ సినిమాలకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కి వచ్చేలా లేడు. ఒకవేళ రాజా తరుణ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ సినిమాల పరిస్థితి ఏంటో తెలీదు. అందుకే ఎలాగో రిలీజ్ కి రెడీగానే ఉన్నాయని ఈ రెండు సినిమాలు వారం రోజులు గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు థియేటర్స్ లో ఆడతాయా లేదా చూడాలి. అసలే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. థియేట్రికల్ మార్కెట్ ఎలాగో లేదు కాబట్టి కనీసం థియేటర్స్ లో నామ మాత్రానికి రిలీజ్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తే బెటర్ అని నిర్మాతలు భావిస్తాన్నారని, అందుకే రిలీజ్ ఇలా ఇప్పుడే ప్లాన్ చేసారని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు