Nayanthara Upset With Atlee
Nayanthara Upset With Atlee : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో నయనతార (Nayanthara) ఒకరు. అభిమానులు అందరూ ఆమెను ముద్దుగా లేడి సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇటీవలే ఆమె జవాన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. థియేటర్ల వద్ద ఈ సినిమా పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా ఘన విజయం విజయం సాధించడం పట్ల నయనతార సంతోషంగా ఉన్నప్పటికీ దర్శకుడు అట్లీపై తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
జవాన్ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె క్యామియోలో నటించింది. అయితే.. నయనతార పాత్రతో పోలిస్తే దీపిక పోషించిన పాత్ర అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. దీంతో తన పాత్రను తక్కువ చేసి చూపించారని దీపిక పాత్రను మాత్రం బాగా ఎలివేట్ చేశారనే అభిప్రాయంలో నయన్ ఉందనే టాక్ నడుస్తోంది. దీంతో తన పాత్రను కావాలనే తక్కువ చేసి చూపించిన దర్శకుడు అట్లీపై తీవ్ర అసంతృప్తితో నయన్ ఉందట. జవాన్ చిత్రం నయనతార, షారుఖ్ ఖాన్ ల సినిమాగా కాకుండా దీపికా, షారుఖ్ ఖాన్ల సినిమాగా ఉందనే అభిప్రాయాన్ని నయన్ తన సన్నిహితుల దగ్గర అందని టాక్
సినిమాలో తన పాత్రపై మొదటి నుంచి నయనతార అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే ఆమె జవాన్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన లేదని వార్తలు వచ్చాయి. తాజాగా ముంబైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్ర బృందం మొత్తం పాల్గొనా ఆమె మాత్రం రాలేదు. దీంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. నిజానికి నయనతార గత కొన్నాళ్లుగా ఆమె నటించిన ఏ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనని సంగతి తెలిసిందే. ఆమె నో ప్రమోషన్ పాలసీని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఏదైన చేదు అనుభవాల కారణంగా నయనతార ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ దొరికింది..
ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి విలన్గా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియమణి, సన్యా మల్హోత్రాలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. భారతదేశంలో రూ.550 కోట్లను వసూలు చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ చేరనుంది.