Home » National » Sonia Gandhi Participated In Bharat Jodo Padayatra
Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.. ఫొటో గ్యాలరీ
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర"లో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సోనియా.. చాలా రోజుల తరువాత ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాండ్యాలో రాహుల్ గాంధీ పాదయాత్రలో సానియా పాల్గొనడంతో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఆమె వెంట నడిచారు. రాహుల్ వెంట సోనియా ఉత్సాహంగా నడిచారు. రాహుల్, పక్కనే ఉన్న నేతలతో ముచ్చటిస్తూ సోనియా పాదయాత్రలో ముందుకు సాగారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.