కొడుకుని మొసళ్లు ఉండే నదిలో తోసేసిన తల్లి

Crime: బాలుడిని మొసళ్లు కొరికి తిన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

పిల్లాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే అతడిని మొసళ్లు ఉండే నదిలో తోసేసింది. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవ పెట్టుకున్న ఆ మహిళ అతడిని ఏమీ చేయలేక ఆ కోపం అంతా తన కుమారుడిపై చూపింది.

ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సావిత్రి (33) ఆమె భర్త రవికుమార్ కు గొడవలు జరుగుతున్నాయి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వినోద్ కి ఆరేళ్లు. అతడికి చెవులు వినబడవు, మాటలు రావు. అతడి విషయంలో భార్యాభర్తలు గొడవపడుతున్నారు.

రెండు రోజుల క్రితం గొడవ పడ్డ సావిత్రి వినోద్ ను తీసుకుని మొసళ్లు ఉండే నదిలో పడేసింది. బాలుడిని మొసళ్లు కొరికి తిన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి మృతదేహం నిన్న ఉదయం దొరికింది.

సావిత్రి, రవిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. వినోద్ ఎందుకూ పనికి రాడంటూ, అటువంటి కొడుకును కన్నావంటూ రవి తనతో తరుచూ గొడవపడేవాడని సావిత్రి చెప్పింది. వినోద్ చావుకు భర్తే బాధ్యుడని అంటోంది.

Malla Reddy : వాళ్లందరిని నేనే కాంగ్రెస్‌లోకి పంపా, కోవర్టులుగా పని చేస్తున్నారు- మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు