Road Accident Two Killed : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయి.
బైక్ పై వెళ్తోన్న తండ్రి భాస్కర్(35), కొడుకు అంజి(11) మృతి చెందారు.తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Kishtwar: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
మృతులు ఏపీలోని గుంటూరు జిల్లా ముత్యాలమపహాడ్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.