Minister KTR : తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే, బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం : కేటీఆర్

తెలంగాణలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు,సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ విమర్శించారు.

Minister KTR

Minister KTR Fire On congress : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు సైతం తెలంగాణలో వరుస పర్యటనలతో హీటెక్కిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీనేతలు విమర్శలు సంధిస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు,సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ విమర్శించారు.

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పైనా..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంతు.. అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకపడ్డారు.

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక…

గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు..
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు..

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది..

మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది..
కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా
ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు..

రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ..
తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది..

నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి..
తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..

కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్..
కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..
ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ??

దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను
కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు…
ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి
అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది.

శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు
ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు.

తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే..
వందల మంది బలిదానాలకు కారణం.

నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా..
తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్

గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే..
తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.
టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న
రాబందు… రేవంతు..

రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ??
రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..

మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది..
మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది.

మూడు రోజుల పర్యటన చేసినా..
మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు.
వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు..

ఇలా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని..అన్నారు. కాగా తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రామాంజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల దోపిడీ చేశారని.. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్, ప్రియాంకలు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు