YS Sharmila : స్వరాష్ట్రంలో పెద్ద కొలువులేవి? ఒక్కరికీ ఉద్యోగం దక్కకలేదు : వైఎస్ షర్మిల

నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

YS Sharmila

YS Sharmila – CM KCR : సీఎం కేసీఆర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమంలో గ్రూప్-1 రాయకుండ్రి, మనయ్ మనమే రాసుకుందమని రెచ్చగొట్టిన దొర.. ఎక్కడ పాయె స్వరాష్ట్రంలో పెద్ద కొలువులని ప్రశ్నించారు. ఊరించి ఊరించి 9 ఏళ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ గట్టు దాట లేదని ఎద్దేవా చేశారు. ఒక్కరికీ ఉద్యోగం దక్కకలేదన్నారు.

503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు జరిగి రద్దైన ఘటన.. బహుశా దేశంలోనే మీ అసమర్థ విధానాలకు ఒక దర్పణం అని విమర్శించారు. పాలన చేతకాదనడానికి ఇది నిదర్శనం అన్నారు. పోటీ పరీక్షలు పెట్టరాదని బయటపడ్డ వాస్తవం అన్నారు. ‘మీకు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమే.. సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమే.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని ఆరోపించారు.

Malla Reddy: మైనంపల్లి పార్టీని వీడారు.. ఆయన గురించి..: మంత్రి మల్లారెడ్డి

టీఎస్పీఎస్సీకి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తి నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని అన్నారు.

ఆనాడే లీకుల సూత్రధారులను పక్కన పెట్టుంటే.. నిరుద్యోగుల డిమాండ్లను గౌరవించుంటే.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ చేసుంటే.. ఇవాళ మరోసారి 2.37 లక్షల మంది గ్రూప్-1 అభ్యర్థులకు నష్టం జరిగేది కాదన్నారు. నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు