APRCET Notification : ఏపీలోని వర్సిటీల్లో పీహెచ్డీలో చేరాలనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఫిబ్రవరి 15 (గురువారం) నాడు ఏపీఎస్సీహెచ్ఈ (APSCHE) తరపున యూనివర్శిటీల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
దీని ప్రకారం.. ఈ నెల 20 నుంచి మార్చి 19, 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ టెస్టులో ఫలితాల ఆధారంగా ఏపీ రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో పలు విభాగాల్లో పీహెచ్డీలో అడ్మిషన్ పొందవచ్చు.
అయితే, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏమైనా సవరణలు చేసుకోవచ్చు. వచ్చే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 తేదీల మధ్య మాత్రమే దరఖాస్తులో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉంది.
అనంతరం ఇదే నెలలో ఏపీఆర్సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగనున్నాయి.
ఏపీఆర్సెట్ ప్రవేశానికి అర్హతలివే :