ఎవరో గుర్తు పట్టగలరా..అరుదైన వీడియో..Share చేసిన ఏక్తా కపూర్

  • Publish Date - June 28, 2020 / 03:48 PM IST

రాజకీయాల్లో ప్రత్యర్థులపై పంచ్ లు విసరడం, తనదైన శైలిలో వ్యవహరించడం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానిలో మరో కోణం దాగి ఉందని ఓ వీడియోను బట్టి చూస్తే తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ స్మృతీ ఇరానికి సంబంధించిన అరుదైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో మిస్ ఇండియా కాంటెస్ట్ కు సంబంధించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని విషయానికి వస్తే…పొలిటికల్స్ లోకి రాకముందు…మోడలింగ్ రంగంలో రాణించారామె. టీవీ నటిగా, నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్..స్మృతీ ఇరానిలు ఫ్రెండ్స్.

1998లో మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న స్మృతీ ఇరానికి సంబంధించిన వీడియోను ఏక్తా కపూర్ షేర్ చేశారు. రాజకీయాలంటే త‌న‌కెంతో ఆస‌క్తి అని స్మృతీ ఇరాని తెలిపారు. నా స్నేహితురాలిని చూసి ఎంతో గర్వ పడుతున్నానని, వినయం, మాట నిలబెట్టుకొనే తత్వమే స్మృతీ ఇరాని అద్బుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయని ఏక్తా కపూర్ వెల్లడించారు.

మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న తర్వాత..పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.

Read:  ఇన్ స్టాగ్రాంలో ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వల

ట్రెండింగ్ వార్తలు