ఉత్తరప్రదేశ్లో ఇద్దరు చిన్నారులతో సహా తొమ్మిదిమంది పాలిట మృత్యుఘోషగా మారింది. ప్రతాప్గఢ్ జిల్లా వద్ద శుక్రవారం (జూన్ 5,2020) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని ఎస్యూవీ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై ఎస్పీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ..నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాజిద్పూర్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులు తొమ్మిది మంది అక్కడిక్కడే చనిపోయారని తెలిపారు.
వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంమీద బైటకు తీశామని..వీరంతా రాజస్థాన్ నుంచి బీహార్కు వెళ్తున్నారని..మృతులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదన్నారు. ఈ ప్రమాదంపట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను తన సంతాపం తెలియజేశారు.
Read: ఉచితంగా మాస్క్లు పంచిన వ్యక్తికి కరోనా…