కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కారణంగా లక్షలకు పైగా ప్రభావితం అయ్యారు. ప్రపంచం మొత్తం మీద 80.9 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారతదేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య నిరంతరం పెరిగిపోతోంది.
అయితే కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి కమ్యునిటీ స్ప్రెడ్. చేతులు కడుక్కోకపోవడం.. మాస్క్లు ధరించకపోవడం. అయితే ప్రజలకు అవగాహన కలిగించడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే లాక్డౌన్ సడలింపులు తర్వాత ప్రయాణ సౌకర్యాలకు వెసులుబాటు ఇవ్వగా.. కరోనావైరస్ తీవ్రతను చూసిన ఆటో రిక్షా డ్రైవర్ తన ఆటో లోపల వాష్ బేసిన్ బిగించి వాటర్ బాటిల్స్ అమర్చాడు ఓ ఆటో డ్రైవర్. ఇప్పుడు ఆ వ్యక్తి ఆటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోను ఆటోవాలా అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటో రిక్షా డ్రైవర్ను ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తి తన ఆటోలో హ్యాండ్ వాష్ పెట్టి వాటర్ బాటిల్తో ఎలా అమర్చాడో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
Corona Virus ka bilkul ricks nahi lene ka pic.twitter.com/I2uWJ82Fzm
— Autowaala (@Autowaala) June 15, 2020
Read: Trump నిర్ణయంపై Google CEO రెస్పాన్స్