Two Workers Killed : విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీకై ఇద్దరు కార్మికులు మృతి

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు.

gas leak in Paravada Pharma City : విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. రామ్‌కి ఫార్మా కంపెనీలోని.. వ్యర్థ జలాల పంప్‌హౌస్‌ వాల్ ఓపెన్ చేస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో పాయకరావుపేటకు చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి మణికంఠ మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు