Airtel Jio 5G Services : భారత్ 5G సర్వీసులతో డిజిటల్ విప్లవం వైపు పయనిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్తో సహా టెలికాం ఆపరేటర్లు హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తమ 5G నెట్వర్క్లను అందిస్తున్నాయి. 5G అందుబాటులో ఉన్న 4G నెట్వర్క్ కన్నా దాదాపు 20రెట్లు నుంచి 30 రెట్లు వేగంగా ఉంటుంది. ఈ రెండు టెల్కోలు సెప్టెంబర్ 2022 నుంచి తమ సంబంధిత 5G నెట్వర్క్లను లాంచ్ చేయడం ప్రారంభించాయి. జూలై 2023 నాటికి హై-స్పీడ్ నెట్వర్క్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా 8వేల నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ డౌన్లోడ్లు, స్ట్రీమింగ్ అంతరాయం లేని వీడియో కాల్లను అందిస్తాయి.
ఎయిర్టెల్, జియో రెండూ ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్కతా, నాధ్ద్వారా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, పూణే, తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, లక్నో సహా దాదాపు 8వేల నగరాల్లో తమ 5G సర్వీసులను ప్రారంభించాయి. అందులో త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం భారత్లో 7,500 కన్నా ఎక్కువ ప్రాంతాలు, జిల్లాలు, నగరాల్లో తన 5G నెట్వర్క్ను లాంచ్ చేయగా.. జియో 5G సర్వీసుల్లో కొంచెం ముందుంది. ఎయిర్టెల్ విషయానికొస్తే.. భారత్లోని ఎయిర్టెల్ 3వేల కన్నా ఎక్కువ నగరాల్లో తన 5G సర్వీసులను రిలీజ్ చేసింది.
5Gని ఎలా యాక్టివేట్ చేయాలి :
5G బెనిఫిట్స్ పొందాలంటే.. ముందుగా సర్వీసు యాక్టివ్గా ఉండే ప్రాంతంలో యూజర్లు ఉన్నారని నిర్ధారించుకోవాలి. ఎయిర్టెల్, జియో రెండూ తమ 4G సిమ్ను మార్చకుండా 5G నెట్వర్క్కు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ Android ఫోన్, ఆపిల్ ఐఫోన్ 5G నెట్వర్క్ని ఎలా యాక్టివేట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగదారులు డివైజ్ సెట్టింగ్స్> ‘నెట్వర్క్ & ఇంటర్నెట్’ > సిమ్ని ఎంచుకుని, ఆపై 5Gని ఆన్ చేయాలి.
Airtel and Jio 5G now available in 8000 Plus Indian cities _ how to turn on 5G, Recharge plans
మీకు జియో ఉంటే.. ‘స్టాండలోన్ 5G’ని ఆన్ చేయండి :
ఐఫోన్ యూజర్ల కోసం 5Gని యాక్టివేట్ చేయడం అనేది ఐఫోన్లో 5Gని ఎనేబుల్ చేసే లేటెస్ట్ iOS వెర్షన్కి అప్డేట్ చేయొచ్చు. ఐఫోన్ను అప్డేట్ చేసి, రీస్టార్ట్ చేసిన తర్వాత, వినియోగదారులు Settings > Mobile Data > Mobile Data Options > Voice & Data సెక్షన్కు వెళ్లి, ‘5G On’ లేదా ‘5G Auto’ని ఎంచుకోవడం ద్వారా 5Gకి మారవచ్చు.
జియో, ఎయిర్టెల్ 5G ప్లాన్లు :
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రారంభించిన ప్రత్యేకమైన 5G ప్లాన్ లేదు. ఇప్పటికే ఉన్న 4G రీఛార్జ్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లతో 5G స్పీడ్ను అందించవచ్చు. అయితే, ఫ్రీ 5G బెనిఫిట్స్ పొందడానికి యూజర్లు ప్లాన్లను రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాలి. ముఖ్యంగా, 5G స్పీడ్, ప్రస్తుత ప్లాన్ లేదా పోస్ట్పెయిడ్ లిమిట్పై ఆధారపడి ఉంటుంది. మీరు 2GB డేటా ప్లాన్ని కలిగి ఉంటే.. ప్రతిరోజూ 2GB 5G ఇంటర్నెట్ని పొందవచ్చు. రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 65kbps వరకు పడిపోతుంది. ఈ స్పీడ్ లిమిట్ Airtel, Jio యూజర్లకు వర్తిస్తుంది.