Zomato Now Charging : ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో తాజాగా వినియోగదారులపై అదనంగా రెండు రూపాయలు భారం వేసింది. ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం ఖరీదుతో సంబంధం లేకుండా ప్లాట్ఫారమ్ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి ప్రతీ ఆర్డర్కు రూ. 2 తీసుకోవడం ప్రారంభించింది. (Zomato Now Charging) ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ అయిన స్విగ్గీ నాలుగు నెలల క్రితం నుంచే ఈ రుసుము తీసుకుంటోంది.
ఇప్పుడు తాజాగా జోమాటో కూడా రెండు రూపాయల ప్లాట్ ఫారమ్ రుసుమును వసూలు చేస్తోంది. (Rs 2 On Every Order) 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక నివేదికలో, జోమాటో (Zomato) కంపెనీ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా 12 మిలియన్ల లాభాన్ని సంపాదించింది.
Electricity Bill Kills : దారుణం.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని మీటర్ రీడింగ్ ఉద్యోగి దారుణ హత్య
డెలివరీ పరిశ్రమ మందగమనానికి ఈ నిర్ణయానికి కారణమని బిజినెస్ సీఈఓ,సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటి తెలిపారు. అదనపు ఛార్జీ కేవలం ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే చెల్లుబాటు అవుతుందని, ఇన్స్టామార్ట్ డెలివరీలపై కాదని కంపెనీ ప్రకటించింది. జోమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్లు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్లపై 22 నుంచి 28 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి.