Rajasthan : అమ్మవారి అవతారాన్నంటూ కత్తితో బాలిక హల్ చల్-చెల్లెలి గొంతుకోసి హత్య

రాజస్ధాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.

Rajasthan :  రాజస్ధాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే …జిల్లాలోని చిత్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని   జింఝ్వా ఫలా గ్రామంలో శంకర్ అనే వ్యక్తి  దశ మాత అమ్మవారి విగ్రహం పెట్టి ప్రతిరోజు పూజలు చేస్తున్నాడు.  అమ్మవారు ప్రతిరోజు రాత్రి సమయంలోనే కనిపిస్తుందని గ్రామస్తుల నమ్మకం. దీంతో అందరూ రాత్రిపూట   వచ్చి దర్శనం చేసుకుని  పూజలు చేయించుకుని వెళ్తూ ఉండేవారు.

ఆదివారం రాత్రి 8 గంటలకు గ్రామస్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించుకుంటున్నారు. ఇంతలో   శంకర్ కుమార్తె అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న  కత్తి  తీసుకుని వీరంగం సృష్టించింది. తాను అమ్మవారి అవతారంఅని అందర్నీ చంపేస్తానంటూ బెదిరించింది.  ఆమెను పట్టుకోవాలని చూసిన వారిని గాయపరిచి   అటు ఇటు పరిగెత్తింది.

దీంతో శంకర్, అతని అన్నయ్య సురేష్ ఇతర  కుటుంబ సభ్యులతో పాటు భక్తులంతా పరుగులు తీశారు. అడ్డు వచ్చిన వారికి  కత్తి  గాయాలయ్యాయి. ఈక్రమంలో అటూ ఇటూ పరిగెత్తిన కుమార్తె   పెదనాన్న సురేష్ ఇంట్లోకివెళ్లింది.  అక్కడ నిద్రిస్తున్న సురేష్ కుమార్తె పుష్ప(7) పై దాడి చేసింది.

కత్తితో గొంతు కోసింది. అంతటితో  ఆగకుండా ఆమెను కత్తితో  విచక్షణా రహితంగా పలు చోట్ల పొడిచింది. దీంతో ఆమె అక్కడి కక్కడే చనిపోయింది. కాసేపటికి   కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేసరికి  పుష్ప మరణించి  కనపడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న చిత్రీ పోలీసుస్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

Also Read : Dowry Harassment : అదనపు కట్నం తీసుకురా… లేదంటే నా ఫ్రెండ్ తో గడుపు…

ట్రెండింగ్ వార్తలు