Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో

Delhi Girl : బాలిక దారుణ హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. హత్య ఘటన అంశాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

Delhi Girl Case-Sahil Arrest : ఢిల్లీ రోహిణి ప్రాంతంలో 16ఏళ్ళ బాలిక దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నిందితుడు సాహిల్ ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ లో సాహిల్‌ ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమన్ నల్వా తెలిపారు. నిందితుడు సాహిల్ ఏసీ, రిఫ్రిజిరేటర్ల మెకానిక్‌గా పని చేస్తాడని వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, నిందితుడికి గరిష్టంగా శిక్ష పడేలా చూస్తామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమన్ నల్వా చెప్పారు.

బాలిక దారుణ హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. హత్య ఘటన అంశాన్ని పరిశీలించేందుకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డుప్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది కమిషన్. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీసు అధికారులను కూడా మహిళా కమిషన్ బృందం కలవనుంది.

Also Read..Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

16ఏళ్ల బాలిక హత్య ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. ”16ఏళ్ల అమ్మాయిని 40-50 సార్లు కత్తితో పొడిచారు. ఆపై రాయితో చాలాసార్లు కొట్టి చంపారు. నడిరోడ్డుపై ఇదంతా జరిగినా, చాలామంది దీనిని చూసినా పట్టించుకోలేదు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ఎల్‌జీ, డీసీడబ్ల్యూ చీఫ్, ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలవాలని” కేంద్ర ప్రభుత్వానికి డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ విజ్ఞప్తి చేశారు.

40సార్లు పొడిచి పొడిచి.. బండరాయితో కొట్టి కొట్టి..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రోహిణి ప్రాంతంలో 16ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత కిరాకతంగా హత్య చేశాడు. ఏకంగా 40 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో కొట్టి కొట్టి చంపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హత్య జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. కాగా, ఆ అమ్మాయి అతడి గర్ల్ ఫ్రెండ్ అని.. హత్యకు ముందు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సాహిల్ ను అరెస్ట్ చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. యువకుడు అతికిరాతకంగా బాలికను కత్తితో పొడుస్తుంటే.. అక్కడే పలువురు ఉన్నా అతడిని అడ్డుకోలేదు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వెళ్లిపోయారు. హత్య జరుగుతున్న సమయంలో పలువురు వ్యక్తులు అటుగా వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read..Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. కత్తితో పలుమార్లు పొడిచాడు. బాలిక కిందపడిపోయినా అతడు వదల్లేదు. ఆ తర్వాత బండరాయితో పలుమార్లు దాడి చేశాడు. దాంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంది. అత్యంత భయానకంగా, అతి కిరాతకంగా బాలికను చంపేశాడు నిందితుడు సాహిల్. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ట్రెండింగ్ వార్తలు