టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మెంటల్ హెల్త్ ఎలా ఉందనే విషయంపై ఆలోచన చేయాలంటూ ప్రజలకు ఏపీ సీఎం జగన్ సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. వెన్నుపోట్లు పొడవడం, మనుషులను హత్య చేయించడమే చంద్రబాబు రాజకీయమని చెప్పారు.
జగన్ ను చంపేస్తే తప్పు ఏంటని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, తనను ప్రజలే రక్షించుకుంటారని జగన్ అన్నారు. ప్రజల ప్రార్థనలే తనకు శ్రీరామ రక్ష అని చెప్పారు. లంచాలు, వివక్షలు తావులేని పాలన కావాలంటే వైసీపీకి ఓటు వేయాలని అన్నారు. గతంలోనూ కూటమి పేరుతో మోసం చేశారని తెలిపారు.
ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మోసం చేేసేందుకు మళ్లీ వస్తున్నారని జగన్ చెప్పారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా మనపాలన ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితంలో ఎన్నడూ ప్రజలకు మంచి చేయలేదు, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో వస్తున్నారని చెప్పారు.
ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మ్యానిఫెస్టోను పట్టించుకోరని జగన్ చెప్పారు. తాను మాత్రం 99 శాతం హామీలు అమలు చేశానని తెలిపారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకురాదని అన్నారు.
Also Read: హిరణ్యకశిపుడిలా ఈ యుగానికి ఈయన: పోసాని కృష్ణమురళి