Ganja Seized : విహార యాత్రతో గంజాయి వ్యాపారం-నలుగురు అరెస్ట్

విహార యాత్ర కోసం ఏపీలోని లంబసింగి వెళ్లిన కొందరు యువకులు అక్కడ ఉన్న గంజాయి ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయిని తక్కువ ధరకు కొని హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్

Ganja Seized :  ఏపీలోని లంబసింగి నుంచి తెలంగాణలోని హైదరాబాద్ సంగారెడ్డిల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విహార యాత్ర కోసం ఏపీలోని లంబసింగి వెళ్లిన కొందరు యువకులు అక్కడ ఉన్న గంజాయి ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయిని తక్కువ ధరకు కొని హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ ధరకు అమ్మకం చేస్తున్నారు.

నిందితులు గత  కొంత కాలంగా విహార యాత్ర పేరుతో విశాఖ జిల్లాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తీసుకు వచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. నిందితులు ఎప్పటి లాగా విశాఖ జిల్లా విహార యాత్రకు వెళ్లినట్లు వెళ్లి వచ్చేప్పుడు గంజాయి తీసుకుని వస్తున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్ పేట వద్ద నిందితుల కోసం కాపు కాశారు.
Also Read : Drugs Gang : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
రెండు కార్లలో లంబసింగి నుంచి గంజాయి తీసుకు  వస్తున్న నిందితులను ఆపి తనిఖీ చేయబోగా ఒక కారులోని ముగ్గురు నిందితులు పరారు కాగా…. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 32,52,500 విలువ జేసే 80 కేజీల గంజాయి, 4 సెల్ల్ ఫోన్లు, రూ. 2,500 నగదు… మరియు బ్రిజా, స్విఫ్ట్ డిజైర్ రెండు కార్లని  స్వాధీనం  చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు