Viral Video : భయానక దృశ్యం.. వేగంగా వస్తున్న బస్సు కింద ఎలా పడ్డాడో చూడండి.. వీడియో వైరల్

ఈ భయానక దృశ్యం బస్సు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యింది. కళ్లారా చూసిన బస్సులోని ప్రయాణికులు హడలిపోయారు. జితేంద్ర వైఖరి చూసి బిత్తరపోయారు. Viral Video - Uttar Pradesh

Viral Video - Uttar Pradesh (Photo : Google)

Viral Video – Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోడా గ్రామానికి చెందిన జితేంద్ర అనే వ్యక్తి డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కానీ చనిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై వేగంగా వస్తున్న బస్సు కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జితేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వ్యక్తి ముందుగా కత్తితో తన గొంతు కోసుకున్నాడు. కానీ చనిపోలేదు. ఇంకా బతికే ఉన్నాడు. దాంతో అతడు చావడానికి మరో మార్గం ఎంచుకున్నాడు. హైవే పైకి వెళ్లాడు. రోడ్డు పక్కన నిల్చున్నాడు. అదే సమయలో ఓ టూరిస్ట్ బస్సు వేగంగా రావడాన్ని అతడు గమనించాడు. బస్సు దగ్గరికి వచ్చే వరకు రోడ్డు పక్కన నిల్చున్నాడు. బస్సు దగ్గరికి రాగానే దాని కిందపడ్డాడు.

Also Read..Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

వేగంగా వస్తున్న బస్సు బలంగా ఢీకొట్టడంతో జితేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. జితేంద్ర మానసిక పరిస్థితి బాగోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. చాలా కాలంగా ఆరోగ్యం సరిగా లేదన్నారు. మెంటల్ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో అతడు డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చనిపోవాలని నిర్ణయించుకున్న అతడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. బస్సు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. ఈ భయానక దృశ్యం బస్సు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యింది. జితేంద్ర తమ బస్సు కింద పడి చనిపోవడాన్ని కళ్లారా చూసిన బస్సులోని ప్రయాణికులు హడలిపోయారు. జితేంద్ర వైఖరి చూసి బిత్తరపోయారు.

Also Read..Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు

ట్రెండింగ్ వార్తలు