Municipal Commissioner wife suicide : మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు. అదనపు కట్నం వేధింపులే జ్యోతి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి జ్యోతి మృతదేహం వద్ద ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు.
మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ, అతని తల్లి వేధింపుల వల్లే జ్యోతి సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లమల బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు జ్యోతితో వివాహం జరిగింది. ఆ సమయంలోనే రూ.2 లక్షల కట్నంతోపాటు కోటి రూపాయల విలువ చేసే మూడు ఎకరాల భూమిని ఇచ్చామని జ్యోతి పుట్టింటి వారు తెలిపారు.
Pregnant Suicide : గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు?
మున్సిపల్ కమిషనర్ అయిన తర్వాత మరింత కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించడం మొదలు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం మరో ఎకరం భూమి సైతం రాసి ఇచ్చామని.. అయినా తమ కూతురితో గొడవ పడుతూనే ఉన్నారని మృతురాలి తల్లీదండ్రులు అంటున్నారు.