Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

ఆ బాలిక శరీరం అంతా పంటిగాట్లు కనపడ్డాయి. పదునైన ఓ వస్తువుతోనూ ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి జరిగింది.

Crime News

Crime News – Madhya Pradesh: ఆ అమ్మాయి వయసు 12 ఏళ్లు. ఓ పుణ్యక్షేత్రం సమీపంలో ఆమెపై అతి దారుణాతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది. ఆ బాలిక శరీరం అంతా పంటిగాట్లు కనపడ్డాయి. రక్తపు మడుగులో ఆమె కనపడింది. అంతేకాదు, పదునైన ఓ వస్తువుతోనూ ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా (Satna district) మైహర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శారదా దేవి మాత దేవాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరు గోమాతల సంరక్షణ శిబిరంలో పనిచేసే వ్యక్తని పోలీసులు గుర్తించారు.

ఆ శిబిరాన్ని పుణ్యక్షేత్ర నిర్వాహక కమిటీ నిర్వహిస్తుందని చెప్పారు. నిందితులు ఇద్దరికీ 30 ఏళ్లు ఉంటాయని వివరించారు. వారిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టామని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుందని అన్నారు. వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.

బాధిత బాలికను ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆమె వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. బాలికపై అఘాయిత్య ఘటన వెలుగులోకి వచ్చాక ఇద్దరు ఉద్యోగులను తొలగించామని శారదా దేవి మాత దేవాలయ మేనేజ్‌మెంట్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

బాలికకు మాయమాయలు చెప్పి నిందితులు ఆ పుణ్యక్షేత్ర సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కఠిన చర్యలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

Manipur: మణిపూర్‌కు 21 మంది విపక్ష నేతలు.. ఎంపీ కనిమొళి ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు