Jammu And Kashmir : జమ్మూకశ్మీర్ నదిలో పడిన కారు..ముగ్గురి గల్లంతు

జమ్మూకశ్మీర్ నదిలో కారు పడిన దుర్ఘటనలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కారు ఉధంపూర్ నుంచి రాంబన్ కు వెళుతుండగా చీనాబ్ నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అదృశ్యం అయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు....

Vehicle Falls Into River

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్ నదిలో కారు పడిన దుర్ఘటనలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కారు ఉధంపూర్ నుంచి రాంబన్ కు వెళుతుండగా చీనాబ్ నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అదృశ్యం అయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.

Bengal Panchayat Polls : కేంద్ర భద్రతా బలగాల పహరా మధ్య పంచాయతీ పోలింగ్ ప్రారంభం

కారు నదిలో పడిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, రెండు మొబైల్ ఫోన్లు, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. (Three Missing As Vehicle Falls Into Jammu And Kashmir River)  స్వాధీనం చేసుకున్న వస్తువుల బట్టి ముగ్గురు వ్యక్తులు నదిలో మునిగిపోయారని భయపడుతున్నామని, నదిలో వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి

ఇదిలా ఉండగా శుక్రవారం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బనిహాల్ ప్రాంతంలోని చార్ చినార్ సమీపంలో రోడ్డుపై బోల్తా పడి మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు, స్థానికులు కలిసి ఆర్మీ మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ గాయపడ్డాడు. డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు వారు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు