Gaza : ఇజ్రాయెల్ సైనికుల భీకర బాంబు దాడులతో గాజా గజ గజలాడుతోంది. గాజా నగరంలో ఫోన్లు, ఇంటర్నెట్ లింకులను ఇజ్రాయెల్ సైన్యం నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులను తాము ఎదుర్కొంటామని హమాస్ ప్రతిజ్ఞ చేయడంతో గాజా స్ట్రిప్లో తన భూభాగ కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ సైనిక బలగాలు వరుస దాడుల గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు.
ఇజ్రాయెల్ గాజాలో దాని భీకర బాంబు దాడులతో స్ట్రిప్కు ఫోన్, ఇంటర్నెట్ లింక్లను కత్తిరించింది. గత రాత్రి హమాస్ సాయుధ విభాగం గాజా లోపల రెండు ప్రాంతాలలో ఇజ్రాయెల్ దళాలతో పోరాడుతున్నట్లు తెలిపింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ దేశంలో 1400మంది మరణించారు.
Also Read : Mahua Moitra : పార్లమెంటులో ప్రశ్నించకుండా అదానీ డబ్బులు ఇస్తానన్నాడు…ఎంపీ మహువామొయిత్రా సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 7,326 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ప్రధానంగా పౌరులు,చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక వైపు దాడులు కొనసాగుతుండగా సంధి కోసం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.