Nepali woman : నేపాలీ మహిళ ప్రియుడైన బీహార్ యువకుడి కోసం వచ్చింది…

Nepali woman

Nepali woman : ప్రియుల ప్రేమ కోసం పుట్టిన విదేశీ గడ్డను వదిలి భారతదేశానికి వస్తున్న ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్న పాకిస్థాన్ దేశం నుంచి భర్తను వదిలి సీమాహైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి నోయిడా వచ్చారు. ఈ ఉదంతం మరవక ముందే నేపాలీ మహిళ ప్రేమికుడైన భర్తతో కలిసి ఉండేందుకు భారత్ వచ్చింది. నేపాల్ దేశానికి చెందిన 29 ఏళ్ల సంగీత కుమారి బీహార్ రాష్ట్రంలోని దర్బంగా నగరవాసి గోవింద్ కుమార్ (32)ను రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆ పరిచయంతో అతన్ని పెళ్లాడింది. (Nepali woman leaves husband to marry Bihar man) కాని అప్పటికే గోవింద్ కు పెళ్లి అయిందని , ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలుసుకున్న సంగీతకుమారి తీవ్ర ఆవేదన చెందింది.

Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

సంగీత రెండేళ్ల క్రితం గోవింద్‌ను నేపాల్‌లోని ఒక దేవాలయంలో వివాహం చేసుకుంది. వారిద్దరూ రాక్సాల్‌లో నివసించేవారు. ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న గోవింద్‌ను సమస్తిపూర్‌కు బదిలీ చేయడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అతను సంగీతను తీసుకెళ్లడానికి త్వరలో వస్తానని హామీ ఇచ్చాడు, కానీ తిరిగి నేపాల్ రాలేదు. దీంతో సంగీత గోవింద్‌ గురించి అతను పనిచేసే కంపెనీలో విచారించింది. అతని ఆచూకీ తెలుసుకున్న సంగీతకుమారి దర్భంగాలోని గోవింద్ నివాసానికి చేరుకుంది. అయితే గోవింద్ మరో భార్య ప్రేరణ కుమారితో కలిసి నివసిస్తున్నాడని తెలుసుకొని షాక్ తింది. సంగీత, ప్రేరణలిద్దరూ మోసపోయామని ఆవేదన చెందారు.

Chittoor : తల్లీబిడ్డల హత్య, బాలికపై అత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

గోవింద్ కుటుంబంతో ఇద్దరు మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం గోవింద్ తల్లిదండ్రులు ఇద్దరు మహిళలను ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సంగీత, ప్రేరణ దర్భంగాలోని మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి గోవింద్, అతని కుటుంబంపై ఫిర్యాదు చేశారు. గోవింద్ తనను 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడని, తనకు రెండేళ్ల కుమార్తె కూడా ఉందని ప్రేరణ తెలిపింది. ఇద్దరు భార్యల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు