Queen Elizabeth Letter secret : గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఎన్నో కీలక విషయాలు బయటపడుతున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన సీక్రెట్ లెటర్. సిడ్నీ ప్రజలను ఉద్దేశించి క్వీన్ ఎలిజబెత్ ఓ లెటర్ రాశారు. బ్రిటన్ రాణి రాసిన ఓ లేఖ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆ లెటర్ లో ఏమని రాశారు? అనే విషయం తెలుసుకోవాలంటే దాన్ని వెంటనే తెరిచి చదవటానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ఆ లెటర్ ను 2085సంవత్సరంలో ఓపెన్ చేసి చదవాలని నిబంధన ఉంది. రాయల్ ఫ్యామిలి అంటే అంతేమరి..ప్రతి విషయం ఆసక్తికరమే. ప్రతీ అంశం ఓ పద్ధతి ప్రకారం..నిబంధనల ప్రకారం జరగాల్సిందే. క్వీన్ ఎలిజబెత్ సిడ్నీ ప్రజలను ఉద్ధేశించి రాసిన ఆ లెటర్ లో ఏమని ఉంది? అనే విషయం ఆమె మరణం తరువాత అత్యంత ఆసక్తికరంగా మారింది. 1986 నవంబర్లో క్వీన్ ఎలిజబెత్ సిడ్నీ ప్రజలకు రాసిన లేఖపై ఉత్కంఠ నెలకొంది. 2085సంవత్సరం వరకు ఆ లెటర్ ను ఓపెన్ చేయకూడదని క్వీన్ ఎలిజబెత్ కోరిక. దీంతో దగ్రేట్ క్వీన్ ఎలిజబెత్ నిబంధన విధించటమూ..దాన్ని ఎవరైనా అతిక్రమించటమూనా?నెవ్వర్..అందుకే ఆ లెటర్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో భద్రంగా ఉంది.
క్వీన్ ఎలిజబెత్ విధించిన ఆ నిబంధనతో ఆ లేఖను ఇంతవరకు తెరవలేదు. 2085 వరకు ఆ లేఖను ఎవరూ తెరిచే వీల్లేదు. అది రాణి కోరిక. కోరిక అనేకంటే రూల్అనటం కరెక్ట్. ఆ లేఖను 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాశారు. 2085లోనే ఈ లేఖను తెరవండి అంటూ నాడు సిడ్నీ నగర మేయర్ కు రాణి సూచన చేశారు. ఆ లేఖలోని సందేశాన్ని సిడ్నీ ప్రజలకు అందించండి అని ఆమె పేర్కొన్నారు.రాణి సంతకంతో కూడిన ఆ లేఖను సిడ్నీలోని క్వీన్ విక్టోరియా హాల్ లో భద్రపరిచారు. రాణి మరణంతో ఈ లేఖ సంగతి మరోసారి బయటికి వచ్చింది. అన్నేళ్ల పాటు తెరవొద్దని సూచించారు? క్వీన్ ఎలిజబెత్ ఆ లేఖలో ఏం రాశారన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ లేఖ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ను పాలించిన రాణుల్లో రెండవరాణి క్వీన్ విక్టోరియా వజ్రోత్సవాన్ని జరుపుకోవడానికి 1898లో నిర్మించిన సిడ్నీలోని క్వీన్ విక్టోరియా భవనం పునరుద్ధణను జరుపుకోవటానికి వ్రాయబడింది. ఆ లెటర్ ఇప్పటికే క్వీన్ విక్టోరియా భవనంలోనే భద్రంగా ఉంది.
క్వీన్ విక్టోరియా ఐర్లాండ్కు 20 జూన్ 1837 నుండి 1901లో ఆమె మరణించే వరకు రాణి. విక్టోరియన్ శకం అని పిలువబడే ఆమె పాలన 63 సంవత్సరాల 7 నెలలు కొనసాగింది. ఈ కాలంలో గతంలో కంటే పారిశ్రామికంగా, రాజకీయంగా, శాస్త్రీయంగా.. బ్రిటిష్ సామ్రాజ్యం గొప్ప విస్తరణ చెందింది. 1876లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమెకు భారత సామ్రాజ్ఞి అనే అదనపు బిరుదును మంజూరు చేసేందుకు ఓటు వేశారు.
King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం .. కింగ్ చార్లెస్ పాలనపై సర్వత్రా ఆసక్తి..
బ్రిటన్ రాణులంటే విలాసవంతమైన జీవనశైలి, ప్రయాణాలు, అధికారం, హోదా.. ఒకప్పుడు సూర్యడు అస్తమించిన రాజ్యం బ్రిటన్… అలాంటి దేశాన్ని.. క్వీన్ ఎలిజబెత్-1, క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్-2 178 ఏళ్లు పాలించారు. వీరిలో ఎలిజబెత్-1, విక్టోరియా రాణుల కాలంలో ఎంతో హాయిగా గడచిపోయింది. కానీ.. ఎలిజబెత్-2కు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రెండో ప్రపంచ యుద్ధంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఆ సమయంలో ఎలిజబెత్-2కు పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్ కాలనీలు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. దీంతో అప్పటివరకు ప్రపంచానికి కేంద్రబిందువుగా మారిన బ్రిటన్.. ఒంటరిగా మిగిలిపోయింది.
బ్రిటన్ రాణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మొదటి రాణి.. క్వీన్ ఎలిజబెత్-1 ముందుంటారు. ఆమె పాలించిన 1558 నుంచి 1603 కాలాన్ని బ్రిటన్ స్వర్ణయుగంగా పిలుస్తారు. అప్పట్లో రాచరికం అనేది అనవాయితీగా ఉండేది. క్వీన్ ఎలిజబెత్-1 హయాంలోనే ఇంగ్లిస్ సాహిత్యం వర్దిల్లింది. విలియమ్ షేక్స్పియర్, క్రిష్టఫర్ మార్లోవ్ పేర్లు మార్మోగిపోయాయి. ఎలిజబెత్-1 కాలంలోనే సముద్రయాణం బ్రిటిషర్ల ఉధృతమైంది. బ్రిటన్ నేవల్ అధికారి ఫ్రాన్సిస్ డ్రాకే ఆధ్వర్యంలో నౌకాదళం సముద్రయానంపై మంచి పట్టు సాధించింది. మొదటి ఎలిజబెత్ రాణి 25 ఏళ్లలోనే బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించింది. ఆ బ్రిటన్ ప్రజలతో పాటు.. ఎలిజబెత్-1 పాలన కూడా హాయిగానే గడిచిపోయింది. 1558లో అధికారం చేపట్టిన ఆమె.. 1603లో చనిపోయేవరకు రాణిగా ఉన్నారు. క్విన్ ఎలిజబెత్-1 తరువాత విక్టోరియా మహారాణి పాలనను విక్టోరియన్ శకంగా పిలుస్తారు. 63 ఏళ్ల 7 నెలల పాటు బ్రిటన్ను ఆమె పాలించింది. ఆమె హయాంలోనే బ్రిటన్.. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యంగా ఎదిగింది. అంటే.. బ్రిటన్ సూపర్ శక్తిగా ఎదిగింది. విక్టోరియా హయాంలోనే పారిశ్రామిక విప్లవం మొదలైంది. విక్టోరియా మహారాణితో పోలిస్తే.. ఎలిజబెత్-2 కాలం ఎలా ఉంది? ఎలిజబెత్-1, విక్టోరియా రాణులతో పోలిస్తే.. ఎలిజబెత్-2 హయాంలో బ్రిటన్ పరిస్థితి ఎలా మారిందో అనే విషయం తెలిసిందే.
Queen Elizabeth : ప్రిన్స్ ఫిలిప్ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్ ఆఖరి మజిలీ