Koneru Satyanarayana : ఇటీవల సినిమాలు రిలీజ్ అయి విజయం సాధిస్తే ఆ సినిమా హీరోలు కానీ, నిర్మాతలు కానీ డైరెక్టర్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. గోల్డ్ లేదా కార్ ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. అయితే ఇటీవల ‘ఖిలాడీ’ సినిమా నిర్మాత సినిమా రిలీజ్ అవ్వకముందే తమ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మకి ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. ‘ఖిలాడీ’ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మకి నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటి 15 లక్షల వ్యాల్యూ గల రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఇంత ఖరీదైన కారుని సినిమా రిలీజ్ అవ్వకముందే ఇవ్వడం విశేషం. దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి??
కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ”రమేశ్ వర్మ సరికొత్త పాయింట్తో చెప్పిన ‘ఖిలాడీ’ కథ నాకు బాగా నచ్చింది. ఇది రవితేజకి బాగుంటుంది అని చెప్పాను. రవితేజ కూడా కథ విని ఓకే చెప్పాడు. రవితేజకి కూడా కథ నచ్చడంతో వెంటనే సినిమా చేద్దామన్నారు. ‘మీ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రావాలని ఈ సినిమా చేస్తున్నాను’ అని రవితేజతో చెప్పాను. ఇటలీలో తీసిన సన్నివేశాలు చూస్తే హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తుంది. ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టాము. ఇటీవల నేను ‘ఖిలాడీ’ సినిమా రషెస్ చూశాను. కచ్చితంగా ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అర్థమైంది. అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందే దర్శకుడు రమేశ్ వర్మకి కారును బహుమతిగా ఇచ్చాను.” అని తెలిపారు. దీంతో ఖిలాడీ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని టీం అంతా ఫిక్స్ అయిపోయారు.