Paddy Cultivation : ఖరీఫ్ లో వరి వెదజల్లే పద్ధతికే మొగ్గుచూపుతున్న రైతులు

మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది.

Paddy Cultivation

Paddy Cultivation : తెలంగాణలో నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు ఈ ఖరీఫ్ లో  వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు  విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో కూలీల  కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో నేరుగా వెదజల్లే పద్ధతితో సాగుచేస్తున్నారు. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు.

READ ALSO : Intercropping in Coconut Plantation : కొబ్బరితోటలో అంతర పంటగా తోటకూర సాగు

ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకి  15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది.

READ ALSO : Paddy Cultivation : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెరగనున్న వరిసాగు విస్తీర్ణం

అందువలనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతుంది. వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలలో, సమస్యాత్మక నేలల్లో అంటే చౌడు, క్షారము, ఆమ్లము ఉండే నేలలు అనుకూలం కాదు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యం తో పాటు ఎరువుల యాజమాన్యం కూగా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం  శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి.

ట్రెండింగ్ వార్తలు