Puneeth Rajkumar : పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంట.. అడ్డుకున్న పోలీసులు

బళ్లారికి చెందిన గంగ, గురు ప్రసాద్​ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి కంఠీరవ స్టూడియోలోని పునీత్​ సమాధి వద్దకు నిన్న వెళ్లారు. పునీత్ రాజ్​కుమార్​కు వీరాభిమానులైన

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి వారం అవుతున్నా ఎవరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో అభిమానులు తరలి వస్తున్నారు. ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ఓ పెళ్లి జంట పెళ్లి మండపంలోనే పునీత్ ఫోటో పెట్టి నివాళులు అర్పించారు. అక్కడి ప్రజలకు పునీత్ అంటే అంత ప్రేమ. తాజాగా ఓ ప్రేమ జంట పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకోడానికి వచ్చారు.

Mehreen : సినిమాలో హీరోకి ఉన్న జబ్బు రియల్ లైఫ్ లో నాకు ఉంది : మెహరీన్

బళ్లారికి చెందిన గంగ, గురు ప్రసాద్​ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి కంఠీరవ స్టూడియోలోని పునీత్​ సమాధి వద్దకు నిన్న వెళ్లారు. పునీత్ రాజ్​కుమార్​కు వీరాభిమానులైన వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందుకే పునీత్ సాక్షిగా అయన సమాధి వద్ద పెళ్లి చేసుకుందామని నిశయించుకున్నారు. అయితే పునీత్ సమాధి ముందు వివాహం చేసుకోవటానికి అక్కడి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

వెళ్తూ మీడియాతో మాట్లాడారు ఆ ప్రేమ జంట. తమకు కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ అంటే చాలా ఇష్టమని, తాము వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు కానీ ఇక్కడ వివాహం చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అన్నారు. అయితే ప్రేమికుల రిక్వెస్ట్‌పై రాజ్‌కుమార్ ఫ్యామిలీ స్పందించింది. పునీత్ సమాధి ముందు ప్రేమ జంటలు పెళ్లి చేసుకునేందుకు తమకు ఇబ్బంది లేదని, అయితే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని, పునీత్ ప్రజల ఆస్తి అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు