Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్(Bhola Shankar ). మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా సుశాంత్, కీర్తి సురేష్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది భోళా శంకర్.
తాజాగా భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించే కాక అనేక విషయాలపై స్పందించారు. ఇటీవల మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు, దీంతో అభిమానుల్లో కూడా రీమేక్ సినిమాలు వద్దు అని నిరాశ వ్యక్తమవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి దీని గురించి మాట్లాడారు.
Hyper Aadi : మెగా ఫ్యామిలీని విమర్శించే వారికి హైపర్ ఆది పంచ్.. కుర్చీ మడత పెట్టి..
చిరంజీవి మాట్లాడుతూ.. ఈ మధ్య నన్ను రీమేక్ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. ఒక మంచి సినిమా, కంటెంట్ వస్తే అది నా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి అందచేయాలని భావిస్తాను. అందుకే రీమేక్ సినిమాలు మంచివి వస్తే చేస్తాను. అయితే ఇటీవల ఓటీటీ వల్ల అన్ని సినిమాలు ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నాయి. అందుకే వేదాళం సినిమా రీమేక్ వచ్చినప్పుడు ఇది బయట ఓటీటీలలో ఎక్కడా లేదని తెలుసుకొని ఈ సినిమా చేశాను. ప్రేక్షకులకు నచ్చుతుందనే నేను సినిమాలు చేస్తాను. అంతకంటే ముందు ఖైదీ 150 లో చెప్పినట్టు ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను. ఈ భోళా శంకర్ సినిమా కూడా నాకు నచ్చే చేశాను అని తెలిపారు.