Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ గౌతమ్ రాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో..''తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు కన్నుమూయడం విచారకరం. ఎడిటర్ గా వందల చిత్రాలకి పని చేసిన.....

Gautham Raju :  తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలలో దాదాపు 800కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఇంట్లోనే మరణించారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఎన్నో సంవత్సరాలుగా చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించిన ఆయన పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. గౌతంరాజుకి సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలియచేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంతక్రియలు జరగనున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గౌతమ్ రాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ

ఈ ప్రెస్ నోట్ లో..”తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు కన్నుమూయడం విచారకరం. ఎడిటర్ గా వందల చిత్రాలకి పని చేసిన అనుభవశాలి ఆయన. ఆ విభాగంలో సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులని అందిపుచ్చుకున్నారు. నేను నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, గబ్బర్ సింగ్, గోపాల గోపాల సినిమాలకు శ్రీ గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను”అని తెలిపారు పవన్ కళ్యాణ్.

ట్రెండింగ్ వార్తలు